02-06-2025 02:56:31 AM
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని, అయితే పార్టీలో ఏమైనా సమస్యలుంటే నాలుగు గోడల మధ్యనే చెప్పా లిగానీ, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దు, పార్టీ క్రమశిక్షణ గీత, లక్ష్మణ రేఖను దాటొద్దు అని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఆదివారం గాంధీభవన్లో మల్లు రవి బాధ్యతలు తీసుకున్నారు.
ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ను కలిసి ధన్యవా దాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉన్నదన్నారు.
అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రా హుల్గాంధీ, మీనాక్షినటరాజన్తో పాటు సీఎం రేవంత్రెడ్డి, మహేష్కుమార్గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచం ద్రెడ్డి, సంపత్కుమార్, పార్టీ నేతలు చిన్నారెడ్డి, ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాంనాయక్ పాల్గొన్నారు.