02-06-2025 02:58:00 AM
కరీంనగర్, జూన్ 1 (విజయక్రాంతి): తెలంగాణ దేవతగా కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి గుడి కట్టారు. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలో 2014లో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీకి గుడి కట్టారు. తెలంగాణ దేవతగా అభివర్ణిస్తూ గుడి కట్టించారు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.