1 July, 2026 | 8:51 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సర్వే బాధ్యతలు ఏఈవోలకు ఇవ్వొద్దు

29-09-2024 02:09 AM

టీఎన్జీవో అధ్యక్షుడు జగదీశ్వర్

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): డిజిటల్ క్రాప్ సర్వే పేరు తో వ్యవసాయశాఖలోని విస్తరణాధికారు(ఏఈవో)లను భయభ్రాంతుల కు గురిచేస్తున్నారని తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సెంట్రల్ ఫోరం ఆరోపించింది. యాప్‌ను సెల్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకొని సర్వే చేప ట్టాలని, లేకుంటే విధినిర్వహణలో ఉన్నా సెలవుగా ప్రకటిస్తామని అధికారులు భయపెడుతున్నారని తెలిపింది.

నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో శనివారం  ఏఈవో అధికారుల సెంట్రల్ ఫోరం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనీ పాల్గొని మాట్లాడా రు. పంట సర్వే మొత్తం బాధ్యతలను ఏఈవోల నెత్తినపెట్టడం సరికాదని, సర్వేను పూర్తి చేయాలంటే 455 రోజు లు సమయం పడుతుందని తెలిపా రు.

మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో యువకులు, పిక్ పహానీ వెయ్యి ఎకరాల పరిమితితో సర్వే చేయిస్తున్నారని వివరించారు. రైతు వేదికల్లో నిర్వహించిన రైతు సమావేశాలు, శిక్షణకు రూ. 9 వేలు కేటాయించాల్సి ఉండగా, కేవ లం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని, ఆ నిధులను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఏఈవో రాష్ట్ర అధ్యక్షుడు డీ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి కే సురేశ్‌రెడ్డి, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.