1 July, 2026 | 7:40 PM

Breaking News

కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •  

పథకాలకు పాతర.. సీఎం ఫొటోలతో జాతర

29-09-2024 02:07 AM

మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి పథకాలకు పాతరేసి, ఫొటోలతో ఫోజులు కొడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల డీఎలకు దిక్కు లేదు, పీఆర్సీ గురించి ఊసులేదని మండిపడ్డారు. ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా మాటెత్తడం లేదని, అరకొర రుణమాఫీతో చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

రూ.4 వేల ఆసరా పెన్షన్ పెంపు ఎప్పటి నుంచి చేస్తారో చెప్పడం లేదన్నారు. మహిళలకు గృహజ్యోతి కింది రూ. 2500 హామీ అటకెక్కిందని, కల్యాణలక్ష్మీ,  తులం బంగారం జాడలేదన్నా రు. బతుకమ్మ చీరలను నిలిపేసి నేతన్నల బతుకుల్లో మన్నుపోశారని ఆవే దన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదల కంటికి కునుకులేకుండా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయం లో అక్టోబర్ 7 లోపు సీఎం ఫొటోలు పెట్టాలని ఆదేశాలు ఇవ్వడంపై మండిపడ్డారు.