కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం

23-04-2024 02:13:34 AM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు

కామారెడ్డి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అన్నా రు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగం గా సోమవారం రాజంపేట్ మండల కేంద్రంతో పాటు బస్వన్నపల్లి, ఆర్గోం డ గ్రామాల్లో పర్యటించారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగా గౌడ్, సంగారెడ్డి, చింతల లక్ష్మీపతి, గంగాధర్, అన్వేష్ గౌడ్, మొసర్ల శ్రీకాంత్‌రెడ్డి, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.