09-06-2025 12:53:08 AM
నిజామాబాద్ జూన్ 8: (విజయ క్రాంతి: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అడ్డు అదుపు లేకుండా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. కోట్ల విలువ చేసే భూములు చేతులు మారుతున్నాయి ఇదంతా సర్కార్కు లెక్క లేకుండా జరుగుతున్న దందా. పక్కా ప్రణాళిక ప్రకారంగా వెంచర్లు వేస్తున్నారు.
భూముల అమ్మే వారి కి అడ్వాన్స్ చెల్లించి అగ్రిమెంట్ చేసుకుని వెనువెంటనే ప్లాట్లను చేసి ప్రమోషన్ వరకు ప్రారంభించి అమాయకులకు ప్లాట్లను అంటగట్టి అందిన గారికి దండుకుంటున్నారు. ఇదంతా నిజామాబాద్ నగర శివారులోని మాధవ నగర్ వద్ద వెలిసిన వెంచర్లు జరుగుతోంది.
ఎటువంటి చట్టపరమైన లెక్కలు లేవు ఎటువంటి అనుమతులు లేవు ఎటువంటి ప్రభుత్వ సంబంధిత శాఖల అనుమతులు రియల్ ఎస్టేట్ అనుమతులేని భూములపై లావాదేవీలు జరిగాయి అక్షరాల 30 కోట్లకు పైగా డబ్బులు చేతులు మారాయి అప్పు తీసుకున్న 14 కోట్ల 74 లక్షలకు అనధికారిక లెక్కలు డెవలపర్లు చూపుతుండగా. 10 కోట్ల రూపాయల వరకు దాదాపు 70 మంది 70 ప్లాట్లకై చెల్లించిన డబ్బులు పక్కా రసీదులు చూపిస్తున్నారు.
భవిష్యత్తులో మహానగరంగా వెలుగొందుతున్న నిజామాబాదులో శివారు ప్రాంతమైన హైదరాబాదు రోడ్లోని మాధవ నగర్ లో ప్లాట్ కొంటే పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్న ఆశతో మధ్యతరగతి మానవులు ఆచి తూచి అడుగేసి కొనుగోలు చేసి లక్షల చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది. భూ యజమాని నుండి డబ్బులు చెల్లించి కొన్నట్టు అగ్రిమెంట్ చేసుకున్న డెవలపర్లు అమాయకులైన ప్రజలకి ప్లాట్లు అంటగట్టి అందిన కాడికి దండుకున్నారు.
45 మంది తమ పేరా తమ పిల్లల పేరా తమ బంధువుల విషయమై ప్లాట్లకై చెల్లించినఆ డబ్బులు దాదాపు 12 కోట్లకు పైగానే ఉన్నాయి. డెవలప్ చేయడానికి ల్యాండ్ పర్మిషన్లకు లేఔట్ పర్మిషన్లకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని అందుకుగాను 28 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు డెవలపర్లు చెబుతున్నారు. భూ యజమానికి అరకొర చెల్లించ అగ్రిమెంట్ చేసుకుని ఆ అగ్రిమెంట్ ని పక్కా కొనుగోలు పట్టణంగా చూపి ప్లాట్లు విక్రయించారు.
కాకరమైన మిగతా డబ్బులు చెల్లించాలని భూ యజమాని ఒత్తిడి చేయడంతో ప్రైవేట్ ఫైనాన్స్ ర్ ని డెవలపర్ల ఆశ్రయించి 14 కోట్ల 75 లక్షల రూపాయలు తీసుకున్నట్లు చెబుతున్నారు. కానీ ఇక్కడే ఉంది అసలు కిటుకు అంతా 14 కోట్ల 70 లక్షల రూపాయలను డెవలపర్లకు చెల్లించిన సదరు ఫైనాన్సర్ నేరుగా భూ యజమాని నుండి భూమి కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ శాఖలో దరఖాస్తు చేసుకొని పక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో డెవలపర్లు డెవలపర్లకు డబ్బులు చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేసిన 70 మంది పరిస్థితి గందరగోళంగా మారింది.
42 మందిని కలిసి 12 కోట్లకు పైగా డబ్బులు చెల్లించామని తీరా భూ యజమాని ద్వారా ఫైనాన్సర్ నేరుగా తమ పేరా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని. తమ అగ్రిమెంట్ ప్రకారం తమకు ప్లాట్లు విక్రయించకుండా అదనంగా 6వేలు ఒకరికి 8వేల రూపాయల చొప్పున ఒక్కో గజానికి అదనంగా డబ్బులు చెల్లించాలని డెవలపర్ అంటున్నాడని కొనునుగోలుదారులు వాపోతున్నారు.
డబ్బులు చెల్లించకుంటే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమని మీ ఫ్లాట్లకు మాకు ఏమి సంబంధం లేదని డెవలపర్ల వద్ద వెళ్లి మీ డబ్బులు వసూలు చేసుకోండి అని అంటున్నాడని ప్లాట్ల కొనుగోలుదారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా తాము చట్టపరంగా డబ్బులు చెల్లించి ఆ మేరకు భూ యజమాని నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని మరోవైపు ఫైనాన్సర్లు అంటున్నారు.
డెవలపర్లు మాత్రం అతని డబ్బులు చెల్లించాలని ఆత్రుతతో ఫైనాన్సర్ వద్ద నుండి 14 కోట్ల 75 లక్షల మేరకు అప్పు కింద డబ్బులు తీసుకొని భూ యజమాని తో తాము రిజిస్ట్రేషన్ ఒప్పందం చేశామని డెవలపర్లు అంటున్నారు. చట్టరీత్యా ఒకరికి ముందుగా భూమిని అమ్మకానికి పెట్టి నగదు డబ్బులు తీసుకొని వారికి ఇవ్వకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం నేరం.
ఈ విషయాన్ని మరిచిన డెవలపర్లు భూ యజమాని నుండి ఫైనాన్సర్ పేరా భూమిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో డెవలపర్ లోని ఇద్దరు వ్యక్తులు సైతం సాక్షులుగా సంతకాలు చేశారు. ఇంకేముంది ఫైనాన్సర్ గా చెప్పబడుతున్న వ్యక్తుల చేతికి భూ యజమాని నేరుగా రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజులు భూమిని అప్పగించినట్టు ప్రభుత్వ రికార్డుల నువ్వు నమోదయి ఉంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తమ పేరా ఫైనాన్సర్లు కలిగి ఉన్నారు.
ఒక్కో ఫ్లాట్ కు 12 నుండి 18 లక్షల వరకు 20 లక్షల వరకు చెల్లించి న 45 మంది భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది. ఇదిలా ఉండగా ప్లాట్లు కొనుగోలుకై డబ్బులు చెల్లించిన వారు తమ తమకు చూపించిన ప్లాట్లు కేటాయించాలని సదరు డెవలపర్లు చూపించిన భూమి వద్దకు వెళ్లారు.
అప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోనున్న ఫైనాన్సర్లు భూమి మీద చట్ట పరంగా కనుగోలు చేశాం మా భూమి లోకి రావద్దని వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వారు కోరుకున్న ఆశ్రయించారు. దిక్కుతోచని స్థితిలో పడ్డ కొనుగోలుదారులలో కొందరు గౌరవ జిల్లా న్యాయస్థానంతో పాటు అత్యున్నత న్యాయస్థానంలో కేసులో ఇంప్లీడై తమ మొర న్యాయస్థానానికి విన్నవించుకున్నారు ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది.
ఈ వ్యవహారం అంతా దాదాపు 80 కోట్ల విలువ చేసే భూమిపై నడుస్తోంది ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు సంబంధించి పక్కా లెక్కలు లేవు. ఇంత డబ్బు ఎలా చేతులు మారాయి లెక్కలేని బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలకు జవాబు లేదు. జిల్లా యంత్రాంగం స్పందించి ఉన్నత అధికారులతో విచారణ కమిటీని నియమించి న్యాయస్థానానికి పూర్తి నివేదిక ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ శాఖ అధికారులను బాధితులు కలిశారు.