9 April, 2026 | 10:19 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

నేడు స్టాండింగ్ కమిటీకి ముసాయిదా బడ్జెట్

30-11-2024 12:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): జీహెచ్ ఎంసీ 2025 ఏడాదికి రూ. 8340 కోట్ల ప్రణాళికలతో బడ్జెట్‌ను తయారు చేసింది. ఈ బడ్జెట్‌లో గతేడాది (2024 కంటే రూ.400 కోట్లు అదనంగా కేటాయింపులు చేశారు. ఈ ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలను నేడు శనివారం స్టాండింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. ఆ తర్వాత జనవరిలో జరగనున్న జనరల్ బాడీ సమావేశం ఆమోదానికి సిఫార్సు చేయనుంది.

గత ఏడాది రూ.7937 కోట్ల బడ్జెట్‌ను రూపొందించగా, ఈ ఏడాది రూ. 8340 కోట్లతో బడ్జెట్ తయారు చేశారు. అయితే, గతేడాది రూ. 7937 కోట్ల బడ్జెట్‌ను.. రూ. 8150 కోట్లుగా బల్దియా అప్‌డేట్ చేసింది. ఇది రూ. 213 కోట్లు అదనంగా పెంచినట్టు స్పష్టమవుతుంది. నేడు జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో గతేడాది పెరిగిన బడ్జెట్ కూడా ఆమోదం పొందనుంది.