ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి
17-04-2026 11:18 AM
బోథ్,(విజయక్రాంతి): ఉపాధి హామీ లో పని చేస్తున్న పూరీలకు త్రాగునీటి సమస్య రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని బోథ్ ఎంపీడీవో(MPDO Ramesh) రమేష్ శుక్రవారం సూచించారు.మండలంలోని రఘునాథపూర్ నారాయణపూర్ గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు .ఈ సందర్భంగా కూలీలకు ఎండ నుండి కాపాడుకునే విషయమై సూచనలుఇవ్వడం జరిగింది.పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు . అనంతరం పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడం జరిగింది ఇండ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేసుకోవాలని లబ్ది దారులకు సూచించారు కల్పించాలని ఆయా గ్రామాల సర్పంచులు బాబూలాల్ పృథ్వీరాజ్లకు సూచించారు.ఆయన వెంట ఈసీ మధుకర్ గ్రామాల కార్యదర్శులు సీతారాం మహేష్ లు పాల్గొన్నారు.






