14 August, 2026 | 10:10 PM

Breaking News

ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ.. నిందితుల అరెస్ట్   •   ఘనంగా తిరంగా యాత్ర ర్యాలీ   •   చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరిపించాలి   •   విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •  

డంపింగ్ యార్డును యుద్ధ ప్రాతిపదకన ఎత్తివేయాలి

14-08-2026 09:03 PM

పర్యావరణ విషతుల్యం ప్రజల ఆరోగ్యం గాల్లో దీపమేనా?

డంపింగ్ ప్రాంతంలోని మరణాలన్నీ రాంకీ పాపమే

డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి

జవహర్ నగర్,(విజయక్రాంతి): డంపింగ్ దుర్వాసనతో పర్యావరణం విష తుల్యమవుతూ ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారుతుందని వెంటనే డంపింగ్ యార్డును శాస్త్రీయ పద్ధతిలో యుద్ధ ప్రాతిపదకన ఎత్తివేయాలని లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పవని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమా మహేష్ డిమాండ్ చేశారు. చెత్త రామ్కి డంపింగ్ యార్డ్ ను శాస్త్రీయ పద్ధతిలో శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమామహేశుల ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్ నగర్ మాజీ ప్రజా ప్రతినిధుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా షేక్షావలి  మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ప్రభావిత ప్రాంతంలో రాంకీ యాజమాన్యం నిబంధనల ఉల్లంఘనలతో మరణించిన మరణాలన్నీ అసహజమైన వేనని నష్టపరిహారం చెల్లించాలన్నారు.  డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ దీనికి వెన్నంటి ఉంటుందని తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధుల మద్దతు తెలిపారు. ప్రతి డివిజన్లో కమిటీలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు శాంతి కోటేష్ గౌడ్, శ్రీనివాస్, లలిత యాదవ్ ,సంగీత రాజశేఖర్ ,వేణు, రవి, బాబు, శ్రీనివాస్, వెంకటేష్, సాయి, నవీన్ శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం రాజకుమార్ రాంచందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.