24-06-2025 01:11:28 AM
కొత్తపల్లి, జూన్23(విజయక్రాంతి): ఒలంపిక్ క్రీడలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నదని వీటి ద్వారానే దేశాల మధ్య సహాయం సమన్వయా న్ని ఏర్పాటు చేయవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో స్పూర్తిదాయకంగా నిర్వహింపబడినటువంటి అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రారంభానికి ముందు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి క్రీడా జ్యో తిని వెలిగించి పతాకావిష్కరణ చేశారు. ఒలంపిక్ క్రీడలు చాలా పురాతనమైనవని అని ఈ క్రీడల ద్వారా వివిధ దేశాల పట్ల సత్సంబందాలు కొనసాగుతున్నాయని వివిధ దేశాల మద్య వైరం ఉన్నప్పటికి ఈ క్రీడల ద్వార సమసిపోతుందని శాంతి స్థాపనకు మార్గం సఖమం అవుతుందని తెలిపారు.
క్రీడల ద్వారా దేశ ఔనత్వాన్ని పెంపొందించడమే కాకుండా ఆర్ధికంగా దేశానికి వనరు లు పెరుగుతాయని ముఖ్యంగా ప్రజల యొక్క తలసరి ఆదాయం సైతం పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పారు. పురాతన కాలంలో ప్రారంభమైన ఈ క్రీడ నేటికి వన్నె తగ్గకుండా ప్రతి ఈటా రెట్టింపు ఉత్సాహంతో సన్నాహకంగా నిర్వహిస్తు లోటుపాట్లను స రిచేసుకుంటు ఉత్తమంగా పాల్గొంటున్నారని కొనియాడారు.
భారతదేశంలో భారత్ ఒలంపిక్ సంఘం వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రోత్సహకాలను అందజేయడం శుభ పరిణామమని తెలిపారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా క్రీడల్లో జరిగే లాభాలు మరియు ఏ ఇతర వాటిలో ఉండవని తెలిపిన నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగానిలిచింది.