24-06-2025 01:12:07 AM
బాన్సువాడ (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ కార్యాలయంలో సోమవారం డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ..భారత దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం తన ప్రాణాలను అర్పించిన నిజమైన దేశభక్తుడు. అన్నారు.
భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కలలు కన్న ఏక్ భారత్ మరియు శ్రేష్ఠ భారత్ ను స్మరించు కోవాల్సిందిగా కోరారు. పర్యావరణ కోకన్వీనర్ ప్రకాష్ పటేల్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ బాన్సువాడ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు పైడిమాల లక్ష్మీనారాయణ జిల్లా సెక్రెటరీ పయ్యల శంకర్ గౌడ్ కిసాన్ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి రుద్రూర్ మండల అధ్యక్షులు హరి గ బీర్కూర్ మండల అధ్యక్షులు సాయి కిరణ్ బాన్సువాడ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రసాద్ బాన్సువాడ జనరల్ సెక్రెటరీ అందే చిరంజీవి బాన్సువాడ పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ గుడుగుట్ల అనిల్ బీర్పూర్ జనరల్ సెక్రెటరీ యోగేష్ బిజెపి నాయకులు చీకట్ల రాజు భాస్కర్ రెడ్డి విశాల్ డీజే సాయి పాల్గొన్నారు.