16 April, 2026 | 6:26 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఈడీ చార్జిషీట్ నిరాకరణ

17-12-2025 01:05 AM
  1. మలుపు తిరిగిన నేషనల్ హెరాల్డ్ కేసు
  2. సోనియా, రాహుల్‌కు భారీ ఊరట
  3. ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోలేమన్న ఢిల్లీ హైకోర్టు

 హైదరాబాద్, డిసెంబర్ 16 : ‘ నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.. కేవలం బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చి న ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈడీ  దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేం’ అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో నిందితులుగా అభియోగం మోపబడిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం ధీకి భారీ ఊరట లభించింది.

అయితే, మేజిస్ట్రేట్ ఇచ్చిన సమన్ల ఆదేశాల మేరకు కాకుండా, ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం నమో దు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే కేసు విచారణ జరగాలని స్పష్టం చేయడంతో మలుపు తిరిగింది. మంగళవారం జరిగిన నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ఈడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

దర్యాప్తును నిలిపివేయలేదని స్పష్టం చేసింది. అదే సమయంలో, ఈ దశలో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న సోనియా, రా హుల్ గాంధీలకు ఎఫ్‌ఐఆర్ కాపీని పొందే అర్హత లేదని కూడా కోర్టు పేర్కొంది. తాజా పరిణామంతో గాంధీ కుటుంబానికి ఈ కేసులో ఉపశమనం లభించింది.