15 March, 2026 | 7:46 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

తెలంగాణ అభివృద్ధిపై దూరదృష్టి భేష్

17-12-2025 01:02 AM

సీఎం రేవంత్‌రెడ్డికి సోనియాగాంధీ అభినందన

2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచన

 హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని తీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కలిసి.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను అందజేశారు.

డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రో జుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 వివరాలను సోనియాగాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. దీంతో పాటు రెండేళ్లుగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను సైతం వివరించారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరించగా ఇదే విధంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని సూచించారు.