11 May, 2026 | 6:59 PM

అవినీతి నోట్ల కట్టలు

08-05-2024 12:05 AM

ఝార్ఖండ్ మంత్రి పీఏ పనిమనిషి ఇంట్లో రూ.30 కోట్లకు పైగా నోట్ల కట్టలను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారు లు స్వాధీనం చేసుకొన్న సంఘటన దేశంలోని తాజా రాజకీయ అవినీతికి అద్దం పడుతున్నది. ‘అవినీతి నోట్ల కట్టలు’ శీర్షికన ‘విజయక్రాంతి’లో ఇవాళ వచ్చిన ‘సంపాదకీయం’ పరిస్థితి తీవ్రతను విపులంగా తెలియజేసింది. ప్రజాసేవ కోసం ఉపయోగించాల్సిన అధికారాన్ని నాయకులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అర్థమవుతున్నది. నల్లధనం నిర్మూలనకు కంకణం కట్టుకోవాలి.

ప్రభాకర్‌రెడ్డి, కరీంనగర్