17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి కృషి: రాజ్‌కుమార్‌రెడ్డి

13-05-2025 12:17 AM
  1. కిష్టాపురం ఎస్సీకాలనీలో ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ

డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

నారాయణపేట. మే 12(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపురం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణ భూమి పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ భూమి పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు.

అంతకుముందు గ్రామస్థులు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో రాజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు.

రాజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులను దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్థులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు గద్దెగూడెం యాదన్న, రామ చందర్, బాలరాజు, వెంకటేష్, అధిక సంఖ్యలో గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.