13-05-2025 12:17:15 AM
డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు
నారాయణపేట. మే 12(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపురం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణ భూమి పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ భూమి పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు.
అంతకుముందు గ్రామస్థులు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో రాజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు.
రాజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులను దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్థులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు గద్దెగూడెం యాదన్న, రామ చందర్, బాలరాజు, వెంకటేష్, అధిక సంఖ్యలో గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.