15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం, యోగ సాధన అవసరం

13-05-2025 12:17 AM

ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి 

 గజ్వేల్, మే12: సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం, యోగ సాధన అవసరమని ఎమ్మెల్సీ డాక్టర్ యా దవ రెడ్డి అన్నారు. సోమవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో   శ్రీకృష్ణ పంచపాండవ ధ్యాన క్షేత్రంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ  బుద్ధుడు సూచించిన అష్టాంగ మార్గాల ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందన్నారు.  నేటి మానవాళికి ఆదర్శప్రాయుడన్నారు. సంపూర్ణ ఆరోగ్యకర జీవితానికి యోగాసనాలు, ధ్యానం దివ్య ఔషధంగా పనిచేస్తాయన్నారు.

ఈ సందర్భంగా ధ్యానక్షేత్రం ఏర్పాటుకు  స్థలం బహుకరించిన కర్కాల కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పి నర్సింలు, బాల్ రెడ్డి,  రాజిరెడ్డి, డి ప్రభాకర్ వివిధ గ్రామాలకు చెందిన 200 మంది ధ్యానులు హాజరయ్యారు.