calender_icon.png 15 June, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

28-05-2025 01:35:18 AM

పెద్దకొడప్గల్  పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

కామారెడ్డి, మే 27,(విజయక్రాంతి): ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర అన్నారు.

మంగళవారం కామారెడ్డి జిల్లా పెద్ద కోడపుగల్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు.  అనంతరం రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్హెచ్‌ఓ, మెన్ రెస్ట్ రూమ్, లాక్ అప్ రూమ్, స్టేషన్ పరిసరాలు, పార్కింగ్ స్థలాలను సుదీర్ఘంగా పరిశీలించారు. తదుపరి స్టేషన్ యందు విధులు నిర్వహించు వారి అందరితో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ...  పెండింగ్ లో ఉన్న కేసుల గురించి అడిగి కేసులపై రివ్యూ  చేశారు.  పోలీస్ స్టేషన్ల  పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్ర తల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో పెట్రోకార్ మరియు బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మరియు 100 డయల్ వస్తే తక్షణమే స్పందించాలని తెలిపారు.

నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లతో మాట్లాడుతూ పోలీసు స్టేషన్ లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని అని తెలిపారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి  తీసుకొని రావాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాన్సువాడ విఠల్ రెడ్డి, బిచ్కుంద సిఐ నరేష్, ఎస్త్స్ర మోహన్ రెడ్డి , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.