15 April, 2026 | 11:11 AM

ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా ఆటంకం లేకుండా తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తా

28-10-2025 10:22 PM

ఎంపీడీఓ పోటు సంకీర్త్

పినపాక (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా ఆటంకం లేకుండా తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ఎంపీడీఓ పోటు సంకీర్త్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని అన్నారు. అర్హులకే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని.. ప్రజా శ్రేయస్సు తన లక్ష్యం అన్నారు. ప్రతి గ్రామానికి సమాన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానని అన్నారు.