20-04-2025 10:52:59 PM
చిన్న చింతకుంట: మండల పరిధిలోని ఉంద్యాల గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్దుడు మరణించిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై రామ్ లాల్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని ఉంద్యాల గ్రామంలో వారి బంధువుల శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం వనైకుంట గ్రామానికి చెందిన ఊట్కూరు ఆశప్ప (55) శుభకార్యానికి హాజరై ఆదివారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణంలో తన టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గ మధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బలమైన గాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న ఉంద్యాల గ్రామస్తులు చూసి వృద్ధుని కుమారుడు ఊట్కూరు శ్రీనివాసులు సమాచారం ఇచ్చి 108లో మెరుగైన చికిత్సకై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్ లాల్ నాయక్ తెలిపారు.