26-06-2025 12:42:29 AM
కొత్తపల్లి, జూన్25(విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకమే కాకుండా ప్రజా సంక్షేమంలో ప్రధాన భూమిక పాత్రపోషి స్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అ ధినేత డా వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వివిధ విభాగాల కెప్టెన్స్ మరియు వైస్ కెప్టెన్స్ ఎన్నికల నిర్వహణ ప్రారంభానికి ముఖ్య అతిధిగా హాజరై వారు మాట్లాడారు.
ప్రారంభానికి ముందు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ఎన్నికలకు సంబందించి దిశానిర్దేశం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ఎన్నికల నిర్వాహణ ఒక గొప్ప అధ్యాయమని మరియు ఎన్నికలను సజావుగా నిర్వహించడానికై ఒక ప్రత్యేక కమీషనను ఏర్పాటు చేయడం జరిగినదని.
ఆ కమీషన్ ద్వారానే వివిధ ప్రాంతాలలో ఎన్నికల నియమావలిని రూపొందించి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజా స్వా మ్య విలువలను పరిరక్షించే విధంగా ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల ద్వారానే ప్రజలు వారికి కావల్సిన వసతులను నచ్చిన నాయకుని ఎన్నుకొని సమకూర్చుకుంటారని మరియు అమూల్యమైన ఓటును వేస్తారనిగుర్తుచేశారు.