26-06-2025 12:41:42 AM
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి ఎం తో కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేస్-2పై వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో పలు అంశాలపై మా ట్లాడారు. హైదరాబాద్ మెట్రో ఫేస్-2పై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి విజ్ఞాప నలు ఇచ్చినా స్పందించలేదన్నారు.
మెట్రో ఫేస్-2కు సంబంధించిన డీపీఆర్ కూడా ఇప్పటికే కేంద్రానికి అందించామని ఆయన వెల్లడించారు. వెంటనే కేంద్ర కేబినెట్ హైద రాబాద్ రెండో దశ మెట్రోపై నిర్ణ యం తీసుకోవాలన్నారు. ఈ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసు కుంటారని తాము భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. కేంద్ర జీడీపీలో ఎంతో కీలకంగా తెలంగాణ పాత్ర ఉందన్నారు.