8 April, 2026 | 4:24 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

పంచాయతీల్లో ఎన్నికల కోలాహలం

28-11-2025 12:48 AM

పారంభమైన నామినేషన్ల పర్వం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఫైట్

తాండూరు, 27 నవంబర్ (విజయక్రాంతి) : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల ఎన్నికల కోలాహలం నెలకొంది . నేటి నుండి నామినేషన్లు ప్రారంభం కావడంతో పలుచోట్ల ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేశారు . కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  నేతృత్వంలో బలమున్న గెలుపు గుర్రాల ఎంపిక జరుగుతుంది. టిఆర్‌ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సర్పం అభ్యర్థుల ఎంపిక వారి విజయం తన భుజస్కందాలపై వేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ సైతం చాపకింద్రనీరుల ఆర్థిక ,అంగ  బలమున్న నాయకుల వేటలో పడింది .

ప్రధానంగా మేజర్ గ్రామపంచాయతీలపై బిజెపి పార్టీ కన్నేసినట్టు తెలుస్తుంది. ఇలా మూడు పార్టీల మధ్య బిగ్ ఫైట్ కు గ్రామ పంచాయతీల ఎన్నికలు వేదిక కానున్నాయి.పెద్దముల్ మండలం బండమీదిపల్లి సర్పం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  అభ్యర్థిగా  నత్తి కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. బషీరాబాద్ మండలం దామర్చేడ్ టిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థిగా శ్రీమతి భారతి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో కలిసి నామినేషన్  దాఖలు చేశారు. రేపు నియోజకవర్గంలో ఉన్న పలు మేజర్ గ్రామపంచాయతీలో నామినేషన్లు భారీ స్థాయిలో దాఖలు అయ్యే అవకాశం ఉంది.