09-04-2025 12:19:05 AM
లక్షెట్టిపేట, ఏప్రిల్ 8: పట్టణంలోని స్థానిక న్యాయస్థానంలో సోమవారం రాత్రి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా కొమిరెడ్డి సత్తన్న, ప్రధాన కార్య దర్శిగా ఎస్ ప్రదీప్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ గా నళిని కాంత్,జాయింట్ సెక్రటరీగా ఎన్ సత్యగౌడ్, లైబ్రరీ సెక్రటరీగా షఫీక్, ట్రెజరర్ గా సుమన్ చక్రవర్తి, క్రీడలు & సాంస్కృతిక సభ్యులుగా బి సంతోష్, లేడీ రిప్రజెంటేటివ్ గా జి.పద్మ, కార్యనిర్వాహక సభ్యులుగా రెడ్డిమల్ల ప్రకాశం,రహమతుల్ల, సదాశివ్,లను ఎన్నుకున్నారు. ఎలక్షన్ అధికారులుగా గోవిందరావు, పాల్సన్లు వ్యవహరించారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన వారిని సాలువతో సత్కరించారు.