14 July, 2026 | 6:58 PM

Breaking News

ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •  

ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు

14-07-2026 06:57 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రోజు బొగ్గు గుడిసె నుండి నిజాంసాగర్ వెళ్ళే రహదారి పై నిజాంసాగర్ సబ్-ఇన్‌స్పెక్టర్ జె శివ కుమార్  తన సిబ్బందితో కలిసి ముమ్మర వాహన తనిఖీలు  నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరియు కార్లతో సహా మొత్తం 120 వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

హెల్మెట్ లేకపోవడం, త్రిబుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, లైసెన్స్ లేకపోవడం,మోడిఫైడ్ సైలెన్సర్లతో తిరుగుతున్న వాహనాలపై మొత్తం 20 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఒరిజినల్, డిజిలాకర్/mParivahan యాప్‌లో) అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.  అనుమానస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియచేయాలి. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.