23-11-2025 08:12:12 PM
చేర్యాల: చేర్యాల పట్టణ పద్మశాలి సంఘ కమిటీని సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా కొక్కుల సురేందర్ పాము బాలనర్సయ్య కోశాధికారిగా మలిపెద్ది వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ సంధర్భంగా నూతన కమిటీని సంఘం పెద్దలు వీరబత్తిని సత్యనారాయణ ఆడెపు వెంకయ్య గోనె హరి కూరపాటి మధు కుల సంఘము సభ్యులు తదితరులు అభినదించారు.