16 April, 2026 | 10:49 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కన్నాయిగూడెం ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు

23-11-2025 08:14 PM

హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలు కాపాడుకోవచ్చు..

స్థానిక ఎస్సై ఇనిగాల వెంకటేష్

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో గల ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు స్థానిక ఎస్సై ఇనిగాల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రధాన రహదారిపై కన్నాయిగూడెం మండలం నుండి ఏటూరునాగారం వైపుగా వచ్చి పోయో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు, అనుమానితులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు పేపర్లను పరిశీలించి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని హెల్మెట్ లేనియెడల జరిమాన విదిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలు కాపాడుకోవచ్చని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వాహనా దారులు,సివిల్ మరియు సీఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.