27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ

19-10-2025 12:54 AM

-లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇంజినీర్

-రాజేంద్రనగర్ గంధంగూడ కార్యాలయంలో ఘటన

మణికొండ, అక్టోబర్ 18(విజయక్రాంతి) : లంచాలకు అడ్డుకట్ట వేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. హిమాయత్ సాగర్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా పనిచేస్తున్న అమర్ సింగ్ నాయక్, ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.గంధంగూడలోని విద్యుత్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ పనికి సంబంధించి కాంట్రాక్టర్‌ను ఏఈ లంచం డిమాండ్ చేయడంతో, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, అమర్ సింగ్ నాయక్ డబ్బులు తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు.హైదరాబాద్ రేంజ్-2 డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఏఈ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ ఘటన స్థానిక విద్యుత్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.