19-10-2025 12:56:38 AM
-మంత్రి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు
-ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి, ఎమ్మెల్యే పరామర్శ
పెద్దపల్లి, అక్టోబర్18(విజయక్రాంతి) : జూలపల్లి మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావులు అన్నారు. శుక్రవా రం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో సంజీవ్ మృతిచెందారు. శనివారం మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే విజయరమణరావు జూలపల్లి మండలం కాచపూర్ గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి సంజీవ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండు సంజీవ్ మరణం కాంగ్రెస్ పార్టీకీ తీరని లోటని అవేదన వ్యక్తం చేశారు.సంజీవ్ అంతిమ యాత్ర లో పాల్గొని మంత్రి, ఎమ్మెల్యే పాడె మోశా రు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.