calender_icon.png 28 June, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అధికారుల పొలం బాట

28-06-2025 12:00:00 AM

ఖమ్మం, జూన్ 27 (విజయ క్రాంతి): పొలం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డివిజన్ ఇంజనీర్ టెక్నికల్, సేఫ్టీ ఆ ఫీసర్ ఆధ్వర్యంలో రఘునాధపాలెం మండలంలోని పలు గ్రామాల్లోని పొలాలను సం దర్శించి పొలాల్లోని విద్యుత్ వైర్ లను పరిశీలించారు.

మల్లేపల్లి , గడ్డి కుంట తండా, బావోజితండ గ్రామాలలో స్థానిక ఏ.డి.ఈ రఘునాధపాలెం, ఏ.ఈ మంచుకొండ కలిసి ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ లైన్ల ను రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. పరిశీలనలో ఐదు చోట్ల లై న్లు చాలా క్రిందిగా ఉండి రైతులకు ప్రమాదకరమైనవిగా ఉన్నట్లు గుర్తించినారు.

వెంటనే అట్టి ప్రమాదకరమైన లైన్లను సరి చేయమని సంబంధిత ఏఈ కి సూచించడం జరిగిన ది.తదనంతరం విద్యుత్ శాఖ సిబ్బందికి, రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన క ల్పించినారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ బాబురావు, విద్యుత్ భద్ర త అధికారి, ఏడీఈ రఘునాధపాలెం, ఏఈ మంచుకొండ,విద్యుత్ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.