calender_icon.png 28 June, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డెక్కిన తెలంగాణ ఉద్యమకారులు

28-06-2025 12:00:00 AM

ఖమ్మం, జూన్ 27(విజయ క్రాంతి):కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావొస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఖమ్మం లో ని స్థానిక మ యూరి సెంటర్ నందు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్న 250గజాల స్థలం ,10 లక్షలు ఇంటి నిర్మాణం కి ఆర్ధిక సహాయం,ఉద్యమకారులకు పెన్షన్,హెల్త్ కార్డ్ లు తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని, ఉద్యమకారులు డిమాండ్ చేశారు.

సోనియా గాంధీ ఇచ్చిన 6 వ గ్యారెంటీ ని వెంటనే అమలు చేయాలని లేకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ది చెప్తామని ఈ సందర్భంగా ఉద్యమకారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ డా.కే. వి. కృష్ణారావు,జిల్లా అ ధ్యక్షుడు పసుపులేటి నాసరయ్య , అర్వపల్లి విద్యాసాగర్,పగడాల నరేందర్ ,లింగనబోయిన సతీష్,జడల వెంకటేశ్వర్లు,నెల్లూరి అ చ్యుతరావు, బచ్చల పద్మా చారి,పాలకుర్తి కృష్ణ, చౌహాన్, సీపీఐ పార్టీ నాయకులు సింగ్ నరసింహారావు,మేకల శ్రీనివాస్ దేవిరెడ్డి విజయ్,గాదె లక్ష్మీనారాయణ,ఎస్కే సై దా,సిహెచ్ సీతామహాలక్ష్మి,ఫోరం జిల్లా మ హిళ అధ్యక్షురాలు రెడ్డబోయిన వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.