16 April, 2026 | 8:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అంబేద్కర్ సాక్షిగా నగరపాలక సంస్థకు సుస్తీ

28-06-2025 12:00 AM
  1. అస్తవ్యస్తంగా డ్రైనేజీల వ్యవస్థ...

చెరువులను తలపిస్తున్న రోడ్లపై మురుగునీరు..

కొత్తగూడెం జూన్ 26 (విజయ క్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం మెయిన్ రోడ్ లో గల ఆటో స్టాండ్ ఆవరణలో,నూతనంగా నిర్మించిన బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా గత వారం రోజులుగా మురుగునీరు పేరుకుపోయింది. అయినప్పటికీ నగరపాలక సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా రామవరం పట్టణం (విజయవాడ హైవే) నడిబొడ్డున ఇంతటి మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ లేక బస్టాండ్ ఆవరణ నుంచి కాళీమాత గుడి వరకు మురుగునీరు పేరుకుపోయి చెరువును తలపిస్తోంది. నగరపాలక సంస్థ సిబ్బంది చూస్తూ దాటుకుంటూ వెళ్తున్నారు తప్ప, మురుగునీరు పారద్రోలుటకు కనీస చర్యలు తీసుకోవడం లేదు. అటువైపుగా వెళ్లాలంటే ఆ బురదలోనే వాహనాలు నడపాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఆ దారి గుండా నడవలేని దుస్థితి ఇప్పటికైనా,సంబంధిత మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు దృష్టిసారించి రోడ్డుపై మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. పరిస్థితి ఎలా ఉంటే దోమలు విద్యను మించి ప్రజల అనారోగ్య బారిన పడతారనీ భయాందోళన చెందుతున్నారు.