గ్రామాల్లో పాతబావుల నిర్మూలన చేపట్టాలి: ఎస్సై
13-04-2026 02:11 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): గ్రామాల్లో పాత బావుల నిర్మూలన చేపట్టాలని టేకులపల్లి మండలం బోడు ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం బోడు గ్రామంలో నిర్వహించినటువంటి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో తిరిగి ఉపయోగంలో లేని పాత బావులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిలో పిల్లల భద్రత కూడా తల్లిదండ్రులు తీసుకోవాలని, ఎండలకు బయటకు వెళ్లకుండా నీటి ప్రవాహాలు ఉన్న చోటికి వెల్లనీయకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బోడు సర్పంచ్ పొదెం స్వరూప-సుధీర్, డ్వాక్రా మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




