30 May, 2026 | 1:45 PM

Breaking News

దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •   డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ   •   తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ   •   అన్నకు చెల్లెలి నగ్న ఫోటో పంపి డబ్బులు డిమాండ్.. యువకుడు అరెస్ట్   •  

ఈనెల 15న మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

13-04-2026 02:13 PM

ముకరంపుర,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 15న  తలపెట్టిన బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని  మహిళలకు కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ పిలుపునిచ్చారు. నగరంలోని పార్లమెంట్ క్యాంపు  కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 16న పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాల సందర్భంగా మహిళలకు సంబంధించిన నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు.

దీనివల్ల మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించడంతో దాదాపుగా పార్లమెంటులో 273 స్థానాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం,  ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, మొదలగు కార్యక్రమాలు చేపట్టి మహిళల అభివృద్ధి కోసం పాటు పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కి  మద్దతుగా జరుగుతున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో మహిళా కార్పొరేటర్లు శ్రీలేఖ, శిల్ప, ఉమారాణి ,లక్ష్మి ,పద్మ, మరియు పొన్నం లక్ష్మి పాల్గొన్నారు.