13 April, 2026 | 4:04 PM

Breaking News

కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •   ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ కు కళాశాలలో ఘనంగా నివాళులు   •  

ఈనెల 15న మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

13-04-2026 02:13 PM

ముకరంపుర,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 15న  తలపెట్టిన బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని  మహిళలకు కరీంనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ పిలుపునిచ్చారు. నగరంలోని పార్లమెంట్ క్యాంపు  కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 16న పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాల సందర్భంగా మహిళలకు సంబంధించిన నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు.

దీనివల్ల మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించడంతో దాదాపుగా పార్లమెంటులో 273 స్థానాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది. మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం,  ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, మొదలగు కార్యక్రమాలు చేపట్టి మహిళల అభివృద్ధి కోసం పాటు పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కి  మద్దతుగా జరుగుతున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో మహిళా కార్పొరేటర్లు శ్రీలేఖ, శిల్ప, ఉమారాణి ,లక్ష్మి ,పద్మ, మరియు పొన్నం లక్ష్మి పాల్గొన్నారు.