calender_icon.png 29 June, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 30న చలో పూసుగూడెం

29-06-2025 01:20:10 AM

పిండ ప్రధాన కార్యక్రమానికి ఆహ్వానం

చర్ల,(విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంజరిగింది , ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ జిల్లాకు సాగునీరు అందివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండప్రదానం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేసే కార్యక్రమానికి చర్ల మండలం నుండి అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు పిలుపునిచ్చారు. ఈ నెల 30 వ తేదీ సోమవారం నాడు పూసుగూడెం గ్రామం వద్ద భద్రాద్రి కొత్తగూడెం బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు  ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రధానం కార్యక్రమానికి వేలాదిగా జిల్లా నలుమూలల నుండి వేలాదిమంది కార్యకర్తలు, ప్రజలు హాజరవుతున్నారని ఎన్నికల్లో గెలుపుకోసం. అనేక వాగ్దానాలు చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లో విఫలమైందన్నారు. ప్రజలను మోసం చేస్తూ పధకాల పేరుతో రోజుకో మాట చెపుతూ కాలం గడుపుతున్నారే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.గత ముఖ్యమంత్రి కెసిఆర్  సీతారామ  ప్రాజెక్ట్ ద్వారా జిల్లా కు సాగునీరందించాలని నిర్మాణం చేస్తే,ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు చుక్క నీరందించకుండా, వేరే జిల్లా కు తరలించకపోవడం అన్యాయమన్నారు.