31-05-2025 07:50:51 PM
టిఎస్ యుటిఎప్ జిల్లా అధ్యక్షులు గుండారపు చక్రపాణి..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు గుండారపు చక్రపాణి(Gundarapu Chakrapani), గుర్రాల రాజావేణు పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాలలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయన్నారు.
తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తెలిపారు. ఈ ప్రచార జాతలో జిల్లా అధ్యక్షులు జి చక్రపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజావేణు, జిల్లా ఉపాధ్యక్షులు వి కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్సులు కే చంద్రమౌళి, జి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.