24-06-2025 01:41:54 AM
పని దినాలు రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరతాం-
పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): తెలంగాణలో ఉపాధిహమీ పనులు జోరుగా సాగుతున్నాయి. కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల పనిదినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. మొత్తం కేటాయించిన పనిదినాల్లో 70 శాతం టార్గెట్ను తెలంగాణ చేరుకుంది.
అయితే గతంలో మాదిరిగా 12 కోట్ల పని దినాలు తెలంగాణకు కేటాయించాలని పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశారు. పని దినాలు రెట్టింపు చే యాలని కేంద్రాన్ని కోరనున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వస్తాయన్న నమ్మకంతో ఉపాధి హమీ పనులను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వేగవంతం చేసింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు 18.9 లక్షల కుటుంబాల్లోని 28.48 లక్షల మంది ఉ పాధి కూలీలకు పని కల్పించారు. ఒక్కో కుటుంబం సగటున 24 రో జుల పని దినాలు పూర్తి చేసుకుంది. 1,127 కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నాయి. అయితే సగటున ఒక్కో కూలీకి రూ.250.75 రోజువారి వే తనం లభిస్తోంది. రోజువారీ వేతనం రూ. 307 దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు.
60శాతం వ్యవసాయ అనుబంధ పనులు..
ఉపాధిహమీ పనుల్లో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఉపాధిహమీ పనుల్లో 60 శాతం పనులు వ్యవసాయ అనుబంధ పనులు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా..
వ్యవసాయ అనుబంధ పనులు 50 శాతంగా నమోదయ్యాయి. మే ముగిసే నాటికి ఉపాధి హమీలో భాగంగా రూ.1,416 కోట్లను ప్రభు త్వం ఖర్చు చేసింది. అందులో రూ.1,151.67 కోట్లు వేతనాలు కాగా, రూ.191.03 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్గా నమోదైంది.