calender_icon.png 24 June, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడమే ఎజెండా!

24-06-2025 01:40:11 AM

  1. మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు మరో నీతా?
  2. నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ 
  3. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశమున్నా బీఆర్‌ఎస్‌ను బద్నామ్ చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. సుంకిశాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయటపడతాయోనని గుట్టుచప్పుడు కాకుండా రిపేర్లు మొదలు పెట్టిందని ఆయన సోమవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

సుంకిశాల మీద ఎక్స్‌పర్ట్ కమిటీ ఎంక్వయిరీ, విజిలెన్స్ కమిషన్ విచారణ, జ్యూడిషియల్ కమిషన్, ఎన్డీఎస్‌ఏ రిపోర్డు ఉండదన్నారు. ఇవేమీ లేకుండానే సైలెంట్‌గా రిపేర్ చేయిస్తారని ఆయన విమర్శించారు. అదే మేడిగడ్డలో కుంగిపోయిన పియర్స్‌ను ఎన్డీఎస్‌ఏ, ఎక్స్‌పర్ట్ కమిటీ, రిటైర్డ్ ఇంజినీర్స్ ఇంకా వివిధ సంస్థలు రిపేర్ చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, కన్స్‌స్ట్రక్షన్ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధమని చెప్పినా కేవలం రాజకీయ స్వార్థంతో సన్నాలకు బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్యాస్‌బండకు రాయితీ బంద్ అయితే  రాజీవ్ యువవికాసం అమలు కాకముందే బంద్ అయిందని హరీశ్‌రావు విమర్శించారు.

బీఆర్‌ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్ అయిందని, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయన్నారు. గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు.

కాంగ్రెస్ పాలకుల మాటలు విని విని విసిగిపోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీభవన్‌కు గొర్రెలు తోలుకొని వచ్చి నిరసన తెలిపారన్నారు. రేవం త్‌రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని, ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని మండి పడ్డారు.