24-06-2025 01:44:13 AM
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): బాలానగర్ సీతాఫలం రాష్ట్రం నుంచి 19వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. పోమల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, బాలానగర్ ఫార్మర్ ప్రొ డ్యూసర్ కంపెనీ లిమిటెడ్, ది ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున శుభజిత్ సాహా దీనికి సంబంధించిన దరఖాస్తు సమర్పించారు.
బాలానగర్ సీతాఫ లం ప్రత్యేకమైన వ్యవసాయ, స్వరూప లక్షణాలను ధ్రువీకరించడంలో కీలకపాత్ర పో షించిన డా.సైదయ్య పిడిగాం దరఖాస్తు తయారుచేశారు. మందంగా ఉండే తొక్క, అధిక గుజ్జు, చిన్న సైజు విత్తనాలు, సహజమైన తీపి, దీర్ఘకాలం నిల్వ ఉండే లక్షణం కారణంగా ఈ గుర్తింపు లభించింది. బాలానగర్ సీతాఫలం తినడానికి, పారిశ్రామిక ప్రాసెసింగ్కు చాలా అనుకూలంగా ఉంటుం ది.
మహా రాష్ట్రకు చెందిన బీడ్ సీతాఫలం, మధ్యప్రదేశ్కు చెందిన సియోని సీతాఫలం, ఛత్తీస్గఢ్కు చెందిన కాంకేర్ సీతాఫలం వరుసలో బాలానగర్ సీతాఫలం నాలుగో స్థా నంలో నిలిచింది. ఈ గుర్తింపుతో జియోగ్రాఫికల్ ఇండికేషన్లో తెలంగాణ స్థానం మ రింత మెరుగుపడిందని శుభజిత్ సాహా అభిప్రాయపడ్డారు. అధిక నాణ్యత ఉత్పత్తులకు తెలంగాణ కేంద్రంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
జీఐ గుర్తింపు పొందడంలో కొండా లక్ష్మణ్బాపూజీ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం కీలకపాత్ర పోషించిందని తెలి పారు. జీఐ ట్యాగ్తో బాలానగర్ సీతాఫలానికి చట్టపరమైన రక్షణ, బ్రాండ్ గుర్తింపుతోపాటు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసే అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు.