14 April, 2026 | 1:23 PM

Breaking News

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •  

సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ద్వారా ఉపాధి

10-10-2025 12:48 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి అక్టోబర్ 9 (విజయక్రాంతి) : వివిధ సాంకేతిక కోర్సులలో శిక్షణ పొందడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. గురువారం భువనగిరి మండలం కేంద్రంలో ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఏ టీ సి సెంటర్ లో ఎంత మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని సంబంధిత అధికారులను  అడిగి తెలుసుకున్నారు.

ఏ ఏ కోర్సుల్లో విద్యార్థులు శిక్షణ ఇస్తున్నారని.విద్యార్థులకు అన్నివసతులు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. విద్యార్థులు అందరూ కూడా కష్టపడి శ్రద్ధ తో ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలని సూచించారు . రాబోయే కాలంలో మొత్తం ఈ అడ్వానస్డ్ టెక్నాలజీ రంగంలో జాబ్ లు ఉంటాయని అన్నారు.

డిగ్రీ ఇతర చదువుల ద్వారా మాత్రమే కాకుండా సాంకేతిక విద్య ద్వారా ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా పొందవచ్చును అన్నారు. ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్ బాగుంటుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.