పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఎఫ్ఆర్ఓ లక్ష్మణ్
రాజేంద్రనగర్ జూన్ 6 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టి ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎం తైనా ఉందని చిలుకూరు ఎఫ్ఆర్ఓ లక్ష్మణ్ తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం మంచిరేవుల ట్రెక్ పార్కులో పర్యావరణ మరియు అడవుల పరిరక్షణతో పాటు జీవవైద్యాన్ని కాపాడాలని ఎఫ్ఆర్ఓ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు మొక్కల పెంపకం అడవుల ప్రాధాన్యత తదితర అంశాలపై ఉదయపు నడకలో భాగం గా ట్రెక్ పార్కుకు వచ్చిన మార్నింగ్ వాకర్స్ కు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం లో డిఆర్ఓ రవికుమార్ ఎఫ్ఎస్ఓ మమత. ఎఫ్బిఓ హరిబాబు ఈటిసిలు పాల్గొన్నారు.






