15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ

21-02-2026 06:26 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజానికి మేలు జరుగుతుందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్,రోటేరియన్ శైలేంద్ర సింగ్ అన్నారు. శనివారం తాళ్ల గొమ్మూరు గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర సారపాక ఆధ్వర్యంలో సుమారు 15,000 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మొక్కలను నాటుతున్నారు.

వాతావరణ సమతుల్యత పాటించాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు విధిగా చెట్ల పెంపకం చేపట్టాలని, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్‌బ్యాగ్‌లను, కాటన్‌ బ్యాగ్‌లను ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు రోటేరియన్ రాంబాబు, కార్యదర్శి రోటేరియన్ చాంద్ బాషా, రోటేరియన్లు శ్యామ్ కిరణ్, భాస్కర్,ప్రఫుల్ల కుమార్, చంగల్ రావు, బసప్ప రమేష్, రాజశేఖర్, సత్యనారాయణ,మురళీధర్, తిరుపతిరావు, మహేష్, రోటరాక్టర్స్ విద్యావాణి, మల్లికార్జున్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.