29 July, 2026 | 5:58 AM

కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ

26-05-2026 04:39 PM

ఇల్లందు, మే 26 (విజయక్రాంతి): కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌లో ఎల్‌ఎస్‌ఎన్ కంపెనీలో పనిచేస్తున్న ఓబీ కార్మికుల ఈపీఎఫ్ గత 12 నెలలుగా ఖాతాల్లో జమ కావడం లేదని, వెంటనే జమ చేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో ఇల్లందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని నాయకులు ఎన్ సంజీవ్, తోడేటి నాగేశ్వరరావు, డి ప్రసాద్ హెచ్చరించారు.