29-05-2025 12:24:48 AM
- కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన
బెల్లంపల్లి అర్బన్, మే 28 : బెల్లంపల్లి నియోజక వర్గంలోని నెన్నెల మండలం ఎర్రవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
బుధవారం నెన్నెల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభి-వృద్ధి, సంక్షేమ పనుల తీరును పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, వరి-ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహశిల్దార్ మహేంద్రనాథ్ తో విజిట్ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం రాబోతుందని, ఈ నేపథ్యంలో మండలంలోని ఎర్రవాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
మండలంలోని జంగల్ పేటలోని కొత్తగూడెం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. నిరుపేదల కొరకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్దిదారులకు మాత్రమే పథకం ఫలాలు అందే విధంగా జాబితా రూపకల్పనలో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల లో రైతుల కోసం త్రాగునీరు, నీడ, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన గోనెసంచులు, టార్పాలిన్లను సమకూర్చడం జరిగిందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వారికి కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా సమ- న్వయంతో పని చేయాలని సూచించారు. ఆయన వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి దేవేంద-ర్రెడ్డి, మండల పంచాయతీ అధికారి, ఎపిఓ, ఎపిఎం, ఆర్ఐ, కార్యదర్శులు సంబంధిత అధికా-రులు తదితరులు ఉన్నారు.