29-05-2025 12:26:19 AM
- నకిలీ విత్తనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
మే 28 (విజయక్రాంతి) : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తమై పోలీస్ స్టేషన్ లలో అందు-బాటులో ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
వాహనాల లో అత్యవసర సామాగ్రిని కలిగి ఉండాలని, వాగులు, బ్రిడ్జిలను ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్పుడు తగు చర్యలు చేపట్టాలని సూచిం-చారు. జిల్లాలో గత నెలలో జరిగిన నేరాలపై, గతం లో జరిగిన కేసుల వివరాలు వాటి పురోగ తిపై జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఉట్నూర్ సబ్ డివిజనల్ అధికారులతో బుధ-వారం ఎస్పీ నేర సమీక్ష సమావేశా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... రైతులు మోసపో కుండా నకిలీ విత్తనాలను చలామణిలో లేకుండా కఠినమైన చర్యలను తీసుకోవాలని తెలిపారు. రైతులు నాణ్య మైన విత్తనాలను గుర్తింపు పొందిన దుకాణ యజమానుల వద్ద పొందాలని ప్యాకెట్లపై సరైన లేబుల్, విత్తనం తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ పూర్తి వివరాలను కలిగి ఉండి దుకాణ యజమాని వద్ద బిల్లు గ్రహించాలని సూచించారు.
రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణా జరగకుండా చూడాలని ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆకస్మి-కంగా తనిఖీ చేస్తూ ఉండాలని తెలిపారు. డయల్ 100, బ్లూ కోర్ట్ సిబ్బంది గ్రామ గ్రామాన సంద-ర్శిస్తూ పోలీసు మీకోసం కార్యక్రమా లను నిర్వ హిస్తూ విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఆవశ్యకత పై వివరణ ఇవ్వాలి ఎలాంటి సమాచార మైనా డయల్ 100 లేదా విపిఓకు సంప్ర దించా లని తెలిపారు.
డాబా-లలో ఎలాంటి అసాం ఘిక కార్యకలాపాలు జరగ కుండా, ప్రతి ధాబాలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్స హించాల న్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తులను పూర్తి చేసి కోర్టు లో చార్జి సీటు దాఖలు చేయాలని సూచించా రు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి సురేందర్ రావు, ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, డీఎస్పీ లు పోతారం శ్రీనివాస్, సిహెచ్ నాగేందర్ పాల్గొ-న్నారు.