calender_icon.png 6 May, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయండి

05-05-2025 10:35:37 PM

మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా(Minority Welfare Association President MD. Yakub Pasha) సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో సుమారు 10,000 మంది విద్యార్ధులు ప్రతి ఏటా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి బయటికి వెళ్తున్నారని, మైనారిటీలకు గురుకుల డిగ్రీ కళాశాలలు లేనందున అనేక మంది విద్యార్ధులు గత ఐదేళ్లుగా ఇంటర్ తర్వాత చదువులకు స్వస్తి పలుకుతున్నారన్నారు.

యస్సీ, యస్టీ, బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 79  గురుకుల డిగ్రీ కళాశాలలున్నాయని, మైనారిటీలకు మాత్రం ఒక్క కళాశాల కూడా లేదని అన్నారు. దీని కారణంగా గురుకులాలో ఇంటర్ వరకు చదివిన విధ్యార్దులు ఉన్నత విధ్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కావున బాల, బాలికల కొరకు వేర్వేరుగా ఉమ్మడి జిల్లాలలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు. ఇట్టి విషయాన్ని ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యెక కార్యదర్శి, మైనారిటీ గురుకులాల కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మైన్ లకు  లేఖల ద్వారా తెలియచేయడం జరిగిందని అన్నారు.