24-06-2025 12:57:57 AM
ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అమిత్ షా
నిజామాబాద్ జూన్ 23:(విజయ క్రాంతి) : రైతుల చిరకాల స్వప్నమైన జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 29న నిజామాబాద్ నగరానికి రానున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం చారిత్రాత్మక రోజుగా జిల్లా చరిత్రలో నిలుచుకోని ఉందని ఆయన పొగిడారు.
పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతులకు నూతన శకం ప్రారంభమైందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈనెల 29న నగరంలోని వినాయక్ నగర్ లో గల జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎంపీ అరవింద్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.