calender_icon.png 27 November, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఓడినా..పరిషత్ ఉందిగా!

27-11-2025 12:22:13 AM

  1. తొలుత సర్పంచ్ ఎన్నికలపై గురి

ఓడినా ’పరిషత్’ ఉందనే ధీమా

ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం

గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి

సంగారెడ్డి, నవంబర్ 26(విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికలను తొలుత నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటి రిజర్వేషన్లు సైతం ఖరారు చేసింది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ఆశావహులకు సర్కారు నిర్ణయం మంచి ఆప్షన్ గా కనిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఓటమి పాలైనా.. త్వర లోనే నిర్వహించనున్న పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల తరపున మరోమారు పోటీ చేయవచ్చనే ఉద్దేశంతో పల్లెపోరుకు జై కొడుతున్నారు. షెడ్యూల్స్ సైతం ప్రకటించడంతో ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నా లు ఉమ్మడి మెదక్ జిల్లాలో ముమ్మరం చేశారు.

నిరాశపర్చినా..

రాజకీయ పార్టీల పరంగా జరిగే పరిషత్ ఎన్నికలను మొదట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ దిశగా నోటిఫికేషన్ సైతం సెప్టెంబర్లో విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావించిన ఆశావహులు అందుకు సన్నద్ధమ య్యారు. ప్రధాన పార్టీల తర పు న టికెట్లను దక్కించుకునేందుకు తీవ్రం గా ప్రయత్నించారు.

బీసీ రిజర్వేషన్ల పెంపు ను కోర్టు సమర్ధించకపోవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో వారు నిరాశ చెందారు, తాజాగా పరిషత్ కు బదులు తొలుత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ఖరారు చే గెస్తూ గెజిట్ కూడా ప్రకటించింది.

బీసీల్లో ఆవేదన..

అక్టోబర్ లో 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించడంతో బీసీ స్థానాలు భారీగా పెరిగాయి. రిజర్వేషన్ కలిసిరావడంతో ఆయా కులస్తులు పో టీకి సిద్ద మయ్యారు. తాజాగా ఆ స్థానాలు తగ్గించి ఖరారు చేయడంతో ఆయా కులాలకు సంబం ధించి ఆశావహుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. నిన్నమొన్నటి వరకు పోటీకి ఉత్సాహం చూపిన వారి అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. కొత్త రిజర్వేషన్లతో పోటీకి అవకాశం లేకుండా పోయిందనే ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

ఓడినా మరో అవకాశం ?

గ్రామ ప్రథమ పౌరుడి హోదా దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల్లోని చోటామో టా నాయకులు ఆశపడుతుంటారు. పార్టీయేతర ఎన్నికలు అయినప్పటికీ పార్టీల మద్దతు ఉంటే గెలుపు సునాయాసమవుతుందని భావిస్తుంటారు. పరిషత్ ఎన్నికలు పార్టీ పరంగా జరగనుండడంతో ఆ ఎన్నికల్లో పార్టీల గుర్తుపై పోటీ చేసి ఓడిపోతే స ర్పంచ్ గా మళ్లీ అవకాశం దక్కే పరిస్థితి ఉండదు.

దీంతో పంచాయతీ పోరు అలాంటి అభ్యర్థులకు మంచి ఆప్షన్లా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూ పుతున్నారు. గెలిస్తే సర్పంచుగా గ్రామంలో పెత్తనం చేసే అవకాశం లభిస్తోంది. ఒకవేళ ఓడిపోతే పరిషత్ ఎన్నికల్లో మరోసారి అదృ ష్టం పరీక్షించుకోవచ్చని భావిస్తున్నారు.

మొదలైన సందడి..

పంచాయతీ పోరుకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్లు.. ఎవరు పోటీ చే స్తున్నారనే అంశాలపైనే చర్చ సాగుతోంది. ఆయా పార్టీల నుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులుంటే సర్పంచుగా ఎవరు పోటీ చే యాలి, ఎంపీటీసీగా ఎవరు బరిలో నిలవాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు.

కొంతమంది రెండింటిలోనూ పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. అలాంటి వారు గె లుపుకోసం ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. నిన్నటి వర కు చూసిచూడనట్లుగా వెళ్లే వారు ఆగి మరి పలకరించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. శుభకార్యాలయాలు ఉందని తెలిస్తే చాలు వారి ఇళ్లు, ఫంక్షన్లకు పిలవకుండానేహాజరవుతున్నారు.