22-06-2025 12:37:03 AM
- అసహనం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
-ట్రంప్ పేరును ప్రతిపాదించిన పాక్ ప్రభుత్వం
వాషింగ్టన్, జూన్ 21: భారత్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి పాతపాటే పాడారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో యుద్ధాలను ఆపుతున్నా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరేమో అని బాధను వ్యక్తం చేశారు. ఇక మరో పక్క నోబెల్ శాంతి బహుమతి 2026 కోసం పాకిస్థాన్ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ పేరును సిఫారసు చేసింది.
కాంగో మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటు చేసినట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు అమెరికాకు రానున్నారని తెలిపారు. ఇటువంటి యుద్ధాలు ఎన్ని ఆపినా కానీ తనకు మాత్రం నోబెల్ ఇవ్వడం లేదన్నారు. ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి ప్రతిపాదించినట్టు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.
‘భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా తమపై దాడి చేస్తూ ప్రాణ నష్టం కలిగిస్తుంటే ట్రంప్ జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిర్చారు. ఆయన నిజమైన శాంతి నిర్మాత.’ అంటూ ప్రశంసలు కురిపించింది. పాక్ ప్రతిపాదనను వైట్హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ కూడా ధ్రువీకరించారు.