18-06-2025 12:57:53 AM
జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనా బేగం
మహబూబ్ నగర్ జూన్ 17 (విజయ క్రాంతి) : ప్రతి బిడ్డ మొదటి పాఠశాల అంగన్వాడి కేంద్రమైన ని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం క్రిస్టియన్ కాలనీలో గల కమ్యూనిటీహాల్ లోఅమ్మ మాట- అంగన్ వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డీడబ్ల్యూఓ జరీనా భాగం మాట్లాడుతూ అమ్మ వడి తర్వాత మలి బడి అంగన్ వాడి కేంద్రాలు అని అన్నారు. పిల్లలు ఐదేళ్లు నిండిన తర్వాత బడికి చేరే లోపు అంగన్ వాడి కేంద్రాల్లో చేర్పించాలని కోరారు.
పిల్లలు కోరుకునే విధంగా సంభాషణ, ఆట, పాటలతో విద్యాబోధన చేస్తారని అన్నారు. అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని, త్వరలో ప్రభుత్వం నుంచి యూనిఫామ్ లు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో సిడిపిఓ రాధిక, సూపర్ వైజర్ వలీమ్ సుల్తానా, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సిబి శ్రీ పూజిత, అంగన్ వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.