15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

10-02-2026 12:00 AM

మీడియా సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9, (విజయక్రాంతి): ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ స్పష్టం చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో  కొత్తగూడెం డిఎస్పి  కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ తేదీన జరగబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు కొత్తగూడెం పట్టణ పరిధిలోని 33 డివిజన్లలో రూ 34 వేల విలువగల 40 లీటర్ల మద్యాన్ని, రూ 2. 70 లక్షల విలువ గల 5.5 కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.  మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ను ఉల్లంఘించినందుకు గాను మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని,110 కేసుల్లో 258 మంది సమస్యాత్మక వ్యక్తులను బైండోవర్ చేయడం జరిగిందని వివరిం చారు.

33 డివిజన్లలోని 41 పోలింగ్ స్థానాలలో 110 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఇందులో 65 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా,45 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు.ఓటర్లను ప్రలోవ్ పెట్టే విధంగా ఎవరైనా మద్యం, నగదు ఇతరత్రా వస్తువులను సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు.ఎవరైనా శాంతిభద్రతలకు విగాథం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు.